Monday, May 19, 2025
HomeUncategorizedధాన్యం కొనుగోలులో జిల్లాను అగ్రగామిగా నిలుతాం.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ధాన్యం కొనుగోలులో జిల్లాను అగ్రగామిగా నిలుతాం.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

___
ధాన్యం కొనుగోలులో జిల్లాను ఆర్గ్రగమిగా నిలుతాం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ మార్చి24( సమయం న్యూస్).
        ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
     సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాలభావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
     అనంతరం రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ రైతులు రబీ ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టి తేమను పరీక్షించుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందని, అంతేకాక సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం సేకరణ, కొనుగోలులో రైతులు, పిఎసిఎస్ లు, ఐకెపి కేంద్రాలు ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రబి లో  జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అవసరమైతే ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకించి ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు ,ఓఆర్ఎస్ పాకెట్లు ఏర్పాటు చేయాలని, తాటి మట్టలతో నీడను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు న్యాయంగా వ్యాపారం చేయాలని, తప్పులు చేయవద్దని, తేమ పేరుతో అనవసరంగా రైతులను ఇబ్బందులు చేయవద్దని,లేదంటే తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యానికి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, ఉగాది నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ నుండి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, గతంలో ధాన్యం రీసైకిలింగ్ అయ్యే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏ ఎం ఆర్ పి ఉదయ సముద్రం ద్వారా సాగు నీరు అందించామని, దీనివల్ల ఈ సంవత్సరం లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, ఎల్లారెడ్డిగూడెం వరకు సాగునీరు అందిస్తున్నామని, శ్రీశైలం  హైడెల్ ప్రాజెక్టు ద్వారా ఏఎమ్ఆర్పి నుండి నీరు తీసుకురానున్నామని ఆయన తెలిపారు. బ్రాహ్మణ వెల్లేముల పూర్తి చేయడం ద్వారా మర్రిగూడెం చెరువుకు నీళ్లు ఇస్తామని, కాలువల  ద్వారా నీరు అందించేందుకు భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి, మునుగోడులో రానున్న మూడు, నాలుగు నెలల్లో కాలువలు పూర్తయితే లక్ష ఎకరాలకు నీరు రానుందని తెలిపారు. ఎస్ఎల్బీసీ  సొరంగం పనులను పూర్తి చేస్తామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు .

     జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు ధాన్యాన్ని దృవీకరించాలని ,దొడ్డు,సన్న ధాన్యాన్ని వేరువేరుగా నింపాలని, ధాన్యం కొనుగోలుకు ప్లయింగ్  స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ  స్క్వాడ్స్ ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి రెండు సీజన్లకు సాగునీరు అందించడం వలన లక్ష ఎకరాలయకట్టు పెరిగిందని, ధాన్యం రాకను బట్టి అవసరమైతే కోనుగోలు కేంద్రాలు పెంచుతామన్నారు. గత సంవత్సరం సన్న బియ్యం 45 వేల  మెట్రిక్ టన్నుల దాన్యం పండించిన  రైతులకు 22 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగిందని, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువమంది సన్న ధాన్యం పండించడంపై దృష్టి సారించాలన్నారు.

   డి సి సి బి చైర్మన్ కుంభం శ్రీనివాస రెడ్డి,పి ఏ సి ఎస్ చైర్మన్  నాగరత్నం రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్,అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్,   జిల్లా పౌర సరఫరాల శాఖ  అధికారి హరీష్, తదితరులు మాట్లాడారు.

     కాగా ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ  శేఖర్ రెడ్డి,డిసిఓ. పత్యా నాయక్, మార్కెటింగ్ ఏ డి  ఛాయాదేవి ,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
________________________________

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments