*పెళ్లికాని జంటలకు ఇకపై నో రూమ్.. ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీ*
ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో (OYO) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది. అందులో భాగంగా ఇకపై పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరఠ్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది.