


ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన పరుగుగా పేరుగాంచిన గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2025 8వ ఎడిషన్కు శ్రీకారం
హైబ్రిడ్ మోడ్లో అక్టోబర్ 12, 2025న నిర్వహణ – ఫిజికల్ మరియు వర్చువల్ పరంగా పాల్గొనవచ్చు
పోస్టర్ ఆవిష్కరణ | 130 దేశాల నుంచి రెండు లక్షల మందికిపైగా పాల్గొననున్నట్లు అంచనా
హైదరాబాద్, మే 9, 2025 – గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (గ్లోబల్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ (GGCR)–2025 ను ఎవర్నార్త్ పైన అనుబంధం తో నిర్వహించనున్నారు . హోటల్ దస్పల్లా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమం లో పోస్టర్ ఆవిషకరించారు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన పరుగుగా ఇది పేరుగాంచింది.
ఈ ఏడాది యొక్క థీమ్: “రన్ ఫర్ గ్రేస్ అండ్ స్క్రీన్ ఫర్ లైఫ్”
ఈ రన్ అక్టోబర్ 12న హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించబడుతుంది – హైదరాబాద్లో ప్రత్యక్షంగా మరియు ప్రపంచం నలుమూలల నుంచి వర్చువల్గా పాల్గొనవచ్చు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు:
డా. అలగు వర్షిని, IAS, కార్యదర్శి, తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ – ముఖ్య అతిథి
శిల్పా రెడ్డి, మిసెస్ ఇండియా, మోడల్, ఫ్యాషన్ డిజైనర్, సామాజిక కార్యకర్త – గెస్ట్ ఆఫ్ హానర్
డా. చినబాబు సుంకవల్లి, సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, & గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
కార్యక్రమానికి డా. సుజాతారావు, డా. ప్రమీల చినబాబు, విజయ్ గారు, యోగేంద్రనాథ్ గారు, భరణేంద్ర నల్లమొట్టు, అశోక్ వెంకటాచలం తదితరులు హాజరయ్యారు.
“జాతీయ క్యాన్సర్ వారం సందర్భంగా 70,000 బాలికలకు అవగాహన కల్పించాం. ఈసారి మా సంస్థ నుండి 10,000 విద్యార్థులను రన్కు పంపిస్తాం. క్యాన్సర్ గురించి ధైర్యంగా మాట్లాడాలి,” అని డా. అలగు వర్షిని అన్నారు.
“ఆహారం మనకు ఔషధంగా మారొచ్చు లేదా విషంగా మారొచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్ను తప్పించాలి. శరీరాన్ని వినాలి. అవసరమైన వారికి స్క్రీనింగ్ టెస్టులను గిఫ్ట్ చేయొచ్చు,” అన్నారు శిల్పా రెడ్డి.
“క్యాన్సర్ తక్షణమయిన మరణదండన కాదు. తొలిదశలో గుర్తిస్తే, చికిత్స సాధ్యమే. ఈ పరుగులో పాల్గొనడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహిస్తాం, అలాగే వెనుకబడిన వారికి ఇంటివద్దనే ఉచితంగా స్క్రీనింగ్ అందించవచ్చు,” అన్నారు డా. చినబాబు సుంకవల్లి.
రన్ వివరాలు:
ఫిజికల్ రన్ స్థలం: గచ్చిబౌలి, హైదరాబాద్
స్థానికంగా పాల్గొనబోయే వారు: 30,000–40,000 మంది, అందులో 10,000 నవోదయ విద్యార్థులు
రన్ కేటగిరీలు: 2కె, 5కె, 10కె
నమోదు ఫీజు:
₹600 – 2కె
₹800 – 5కె
₹1200 – 10కె
నమోదు కోసం సందర్శించండి: www.gracecancerrun.com
ఇప్పటి వరకూ ప్రభావం:
11 సంవత్సరాల్లో 1.4 కోట్ల మందికి పైగా ఉచిత స్క్రీనింగ్ చేయడం జరిగింది
130 దేశాల ప్రజలు పాల్గొన్నారు
మొబైల్ స్క్రీనింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందిస్తారు
మునుపటి కార్యక్రమాలు:
ఒడిశా, ఆరకూ లోయలలో గిరిజన స్క్రీనింగ్
తెలంగాణా అంగన్వాడీ సిబ్బంది స్క్రీనింగ్
సైబరాబాద్ పోలీసులకు పరీక్షలు
విద్యాసంస్థల్లో HPV టీకాలు
అంతర్జాతీయ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు
శాస్త్రీయ పరిశోధనల భాగస్వామ్యం
మీరు ఎందుకు ఈ పరుగులో చేరాలి?
ఇది ఒక రన్ మాత్రమే కాదు – ఇది ప్రాణాలను రక్షించే ప్రపంచవ్యాప్త ఉద్యమం.
మీ ఒక్కో అడుగు వెనుకబడి ఉన్నవారికి స్క్రీనింగ్ అందిస్తుంది.
“మీ కోసం కాకపోయినా, మరొకరి కోసం పరుగెత్తండి. క్యాన్సర్ 9 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది మారాలంటే మనమే మారాలి,” అని డా. చినబాబు ముగింపుగా అన్నారు.
అవగాహన కోసం పరుగెత్తండి. మార్పు కోసం పరుగెత్తండి. ప్రాణాలను కాపాడేందుకు పరుగెత్తండి.
మీడియా వివరాల కోసం సంప్రదించండి:
సోలస్ మీడియా – డి. రామచంద్రం
మొబైల్: 98480 42020