Tuesday, January 21, 2025
HomeUncategorizedమూడు సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసి వరంగల్ జిల్లా గీసుకొండ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం...

మూడు సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసి
వరంగల్ జిల్లా గీసుకొండ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు



వరంగల్ జిల్లా గీసుకొండ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్
——————–
బిఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన సంక్షేమ పథకాలు బారాబర్ అమలు చేస్తాం… ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి ఉంది పాలకుల కోసం కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు, ఐదు ఎకరాల కే పరిమితం చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది ప్రచారం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. 10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ నేతలు ఒక్క హామీ పూర్తి చేయలేదు.

మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించాము. రాష్ట్రంలో మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షల కు పెంచాం. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు వినియోగించే పేదలకు ఉచితంగా విద్యుత్తు, పంటల బీమా, రైతు బీమా అమలు చేస్తున్న ము. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ.. చివరి గింజ వరకు కొనుగోలు చేశాం. పాత పథకాలకు కోత విధించకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతుంది.

మేం అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డులు, రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించాము .. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
సగర్వంగా తలెత్తుకొని గ్రామాల్లో ప్రచారం చేయండి.. ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సంక్రాంతి సంబరాలతో పాటు విస్తృతంగా ప్రచారం చేయండి ప్రజల్లోకి తీసుకువెళ్లండి

పదేళ్లపాటు పాలించిన టిఆర్ఎస్ నేతలు మిగులు బడ్జెట్ లో కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల లోపు రుణమాఫీ చేశాం. దాదాపు 22 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశాము. ఆధార్ కార్డులో, బ్యాంకు పుస్తకంలో తప్పులు దొర్లి రుణమాఫీ కాకపోతే ఇంటింటికి సర్వే చేసి వారికి కూడా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాము

బి ఆర్ ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులు సృష్టించిన ఇందిరామ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుంది

సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతున్నాము. ఏడాదికి 12,000 రైతుల ఖాతాలో జమ చేస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులు రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం

భూమిలేని నిరుపేద కూలీలు కూడా మా బిడ్డలే.. వారి బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి 12,000 జమ చేస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం.

బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ నేతలు ఇల్లు కూడా ఇవ్వలేదని నా పాదయాత్ర సమయంలో మీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆవేదనను అర్థం చేసుకొని ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మించబోతుంది. ఇంటికి ఐదు లక్షల రూపాయల పెట్టుబడింది ప్రభుత్వం అందిస్తుంది.

ఈ ఏడాది 5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నాం.

ప్రజా ప్రభుత్వం ప్రతి పని ప్రజల కోసం చేస్తుంది. పెద్ద ఎత్తున సంక్రాంతి  సంబరాలు చేసుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments