

*వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగు నీటి సమస్య రావద్దు*
*దామర గ్రామానికి ధర్మసాగర్ నుండి నీళ్ళు అందించడానికి పైప్ లైన్ కోసం తక్షణమే 20 లక్షల రూపాయలు మంజూరు*
*నియోజకవర్గంలో పారదర్శంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక జరగాలి*
*రేషన్ షాపుల్లో ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ జరగాలి*
*కొత్త రేషన్ కార్డుల అర్హుల ఎంపిక ప్రాసెస్ పూర్తి చేయాలి*
*రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ కుల వృత్తులు ఉపాధి కల్పన పై గ్రామాల్లో అవగాహన కల్పించాలి*
*మండల ,జిల్లా అధికారులు సమన్వయం చేసుకొని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి*
*హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్*
హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు జిల్లాల్లో ఉన్న ఏడు మండలాల్లో వేసవి కాలం దృష్ట్యా తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిద్దిపేట, కరీంనగర్ , హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్ లు ,జిల్లా, మండల స్థాయి అధికారులు ,పంచాయతీ సెక్రటరీ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగు నీటితో పాటు ఇతర ఏ సమస్యలు వచ్చిన అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమస్య నా దృష్టికి తీసుకురాకుండా అధికారులు సమస్య పరిష్కారం చేయకుండా ప్రజలు ఇబ్బందులు పడితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.గ్రామాల్లో తాత్కాలిక బావులు ,బోర్లను తీసుకొని పైప్ లైన్ మోటార్లు బిగించి నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోనీ ఏ ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని మంచి నీటి సమస్యలు కాకుండా రోడ్లు ఇతర ఏ సమస్యలు ఉన్నా ఆరా తీశారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పై ఇప్పటికే ఉన్న ప్రొసీడింగ్స్ ను మూడు రోజుల్లో క్లియర్ చేస్తామని తరువాత సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎల్కతుర్తి మండలం ధామర గ్రామంలో మంచి నీటి కి ఇబ్బందులు ఉండడం ధర్మసాగర్ నుండి దామర పైప్ లైన్ వేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే 20 లక్షలు మంజూరు చేశారు. RWS సమస్యల పై టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమస్య పై పిర్యాదు చేయాలన్నారు. నవాబ్ పేట లో వాగులో ఉన్న బావి నుండి పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, మండల అధికారులు ,జిల్లా అధికారులు ,AE, DE,EE,SC లందరూ సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అయ్యాయని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు రావాలన్నారు. ఇళ్లు లేని పేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఇందులో రాజకీయ ప్రభావం ఉండదన్నారు. త్వరలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా వారికి సహకరించాలని సూచించారు.
ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లబ్దిదారులకు కచ్చితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని ,దొడ్డు బియ్యం కలపడం ,ఇప్పటికే ఉన్న దొడ్డు బియ్యం ఇవ్వడం లాంటివి చేయవద్దని సూచించారు.కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు ఎంపిక ప్రాసెస్ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్న మూడు జిల్లాల పరిధిలో రేషన్ కార్డుల లబ్దిదారుల ఎంపికకు మీ సేవ ,ప్రజా పాలన ద్వారా గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్ లలో అర్హుల ఎంపిక పూర్తి చేయగానే రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని తెలిపారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలు ప్రక్రియ జరగాలి. అధిక తూకం చేస్తే చర్యలు ఉంటాయి. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వాటర్ , లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న రాజీవ్ యువ వికాసం గ్రామ స్థాయి వరకు వెళ్ళలిం ఎస్సీ,ఎస్టీ, బిసీ,మైనార్టీ లకు అర్హులైన వారికి కుల వృత్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి 50 వేల నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.దీనిని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపయోగించుకునేల అవగాహన కల్పించాలనీ సూచించారు. నియోజకవర్గంలో ఉన్న ఈజిఎస్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,500 కి గ్యాస్ ,సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ఒక హుస్నాబాద్ నియోజకవర్గంలోని 250 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందన్నారు.
సమీక్ష సమావేశంలో కరీంనగర్ , సిద్దిపేట ,హనుమకొండ, మూడు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ,మండల అధికారులు ,హుస్నాబాద్ అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీ లు పాల్గొన్నారు.