Friday, May 23, 2025
HomeUncategorizedశానిటేషన్ లో పిన్ పాయింట్ ప్రోగ్రాం ను అమలు చేయాలి: : బల్దియా కమిషనర్ డాక్టర్...

శానిటేషన్ లో పిన్ పాయింట్ ప్రోగ్రాం ను అమలు చేయాలి: : బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే*
▪️పిన్ పాయింట్ ప్రోగ్రాం షెడ్యూలు పాటించని  జవాన్ కు షోకాజు నోటీసు…

*శానిటేషన్ లో పిన్ పాయింట్ ప్రోగ్రాం ను అమలు చేయాలి: : బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే*
▪️పిన్ పాయింట్ ప్రోగ్రాం షెడ్యూలు పాటించని  జవాన్ కు షోకాజు నోటీసు…
▪️ట్రేడ్ ఆస్తి పన్ను వసూళ్ల  తీరు పరిశీలన….

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మార్చి 26( సమయం న్యూస్)

సమర్ధ శానిటేషన్ నిర్వహణలో భాగం గా శానిటేషన్ అధికారులు సిబ్బంది పిన్ పాయింట్ ప్రోగ్రాం ను అమలు చేయాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.

  గ్రేటర్ వరంగల్ నగర పరిధి 61 వ డివిజన్  సిద్ధార్థ నగర్ లో  బుధవారం కమిషనర్  సానిటేషన్ తో పాటు ట్రేడ్,ఆస్తి పన్నుల వసూళ్ల తీరును క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.

  ఈ సందర్భంగా కమిషనర్ శానిటేషన్ పిన్ పాయింట్ ప్రోగ్రాం ను అమలు చేయకుండా  నిర్లక్ష్యం వహించిన  జవాన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

శానిటరీ ఇన్స్పెక్టర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వార్డు లో పిన్ పాయింట్ ప్రోగ్రాం అమలు అయ్యేలా చూడాలని, పారిశుధ్య సిబ్బంది స్వీపింగ్, డ్రైన్ క్లీనింగ్ లకు చెందిన లాగ్ బుక్ ఖచ్చితం గా నిర్వహించేలా చూడాలని, సమయ పాలన పాటించాలని, ప్రతి చెత్త తరలింపు వాహనం రెండు ట్రిపు లు వేయాలని అన్నారు. ఆస్తి, ట్రేడ్ పన్ను వసూళ్లకు  ఏర్పాటు చేసిన బృందాలు ఖాజీపేట పరిధి లో 6 బృందాలు,
కాశీబుగ్గ పరిధిలో ఏర్పాటు చేసిన 5 బృందాలు ప్రతి  రోజు రూ. 50 లక్షల చొప్పున    ఆస్తి, ట్రేడ్ పన్నులు వసూళ్లు జరుపుతూ, దానికి సమాంతరంగా శానిటేషన్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు.  సిద్ధార్థ నగర్ లో రోడ్డు మీద ఇసుక వేసి నిర్మాణం చేస్తున్న యజమానికి పెనాల్టీ విధించాలని కమిషనర్ సి ఏం హెచ్ ఓ ను ఆదేశించారు.
  ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments