
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లి రామయంపేట బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో మెదక్ చేరుకున్నారు.. రామాయంపేట బస్టాండ్ లో శుభ్రత కు సంబంధించి ఆర్టీసీ డిఎంకు పలు సూచన చేశారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలను అడిగి ఆరా తీశారు..
ఆర్టీసీ బస్టాండ్లను ఆధునికరించి బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వము ముందుకు వస్తుందని అందులో భాగంగానే మెదక్,రామాయంపేట బస్టాండ్ ను సందర్శించడం జరిగిందన్నారు..