

*భాషాను బ్రతికించేది అమ్మకే సాధ్యం*
*మాజీ రాష్ర్ట ఎన్నికల అధికారి సి పార్థసారథి*.
హైదరాబాద్ మార్చి01( సమయం న్యూస్)
తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ,అక్షరయాన్ , సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ ,అభిజ్ఞ భారతి ఆర్గనైజేషన్ ల సంయుక్త నియంత్రణలో ప్రారంభమైన జాతీయ సాహిత్య సదస్సులు రవీంద్ర భారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి .ఆ తరం రచయితుల జీవన ప్రస్థానం మీద ఈ తరం రచయిత్రుల పత్ర సమర్పణలు సెషన్ ని ప్రారంభించారు . వంశ పారం పర్య దీప్తులు కార్యాక్రమం ఆరంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు పూర్వ ఎన్నికల అధికారి చిట్ల పార్థసారథి ఐఏఎస్ గారు . గౌరవ అతిథులుగా దీపికా రెడ్డి గారు , రష్మీ కండ్లెకర్ గారు , డా ముక్తేవి భారతి గారు , సామల రమేష్ గారు , రాణి నల్లమోతు గారు పాల్గొన్నారు . ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్థ సారధి గారు తమ సందేశంలో – అమ్మల నుండే భాష బిడ్డకి వస్తుందని , భాష బ్రతికేది అమ్మల వల్లేనని ,ముఖ్యంగా అక్షరయాన్ 1500 మంది రచయిత్రుల కూటమిగా ఏర్పడి ఎంతో సామజిక సేవ చేస్తుందని కొనియాడారు . రచయిత్రులు టార్చ్ బేరర్స్ గా పనిచేస్తారని గతంలో నిర్వహించిన ఎయిడ్స్ , కన్సూమర్ , విత్తనం సదస్సులను గుర్తు చేశారు . సమాజ దిశా నిర్దేశం చెయ్యగలిగేది రచయిత్రులే అన్నారు . 3 తరాల వారసులు ఒకే కళా రూపంలో పాటు పడటం వారిని గుర్తించి ee వేదిక మీద 20 కుటుంబాల వారిని సత్కరించటం ఆనందంగా ఉందని తెలియచేసారు .
ఈ కార్యక్రమంలో అరుణా సుబ్బారావు గారి పేరడీ , భూదేవి పాటలు , అహత సంగీతాలయం జయ సూర్య బృందం చేసిన వాద్య గోష్ఠి entho akattukundi