


నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్సెల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామం గా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు.
ముఖ్యమంత్రి వెంట , ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.