Monday, May 19, 2025
HomeUncategorizedగజ్వేల్ మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు -

గజ్వేల్ మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు –



*గజ్వేల్ మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీమంత్రి హరీశ్ రావు – కామెంట్స్ :*

•   మైనారిటీ సోదరులందరికీ కేసీఆర్ గారి తరఫున శుభాకాంక్షలు
• మీ అందరికీ తెలుసు.. నేను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా  గత 12 – 13 ఏండ్లుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నా.
• ఇది మీకు నాకు మధ్య ఉన్నది విడదీయరాని బంధం.
• తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు.
• కానీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ఏం చేసిందో నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు
• రంజాన్ నెలలో పేద ముస్లిం సోదరుల కుటుంబాలకు కేసీఆర్ గారు  రంజాన్ తోఫా ఇచ్చేవారు.
• ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రంజాన్ తోఫా బంద్ అయిపోయింది.
• మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విలీనం చేస్తున్నది.
• ఇప్పటివరకు ఈ స్కూళ్లకు ఉన్న మైనారిటీ గుర్తింపు లేకుండా పోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.
• కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలనలో హోంమంత్రిగా మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీ గారిని నియమించి గౌరవం ఇచ్చారు.
• ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులను నియమించినా అందులో మైనారిటీ మంత్రి ఉన్నారు, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది మంత్రులను నియమించినా అందులో ఒక్క మైనారిటీ మంత్రికి కూడా చోటు లేరు.
• మైనారిటీ  వారు మంత్రిగా ఉండాలి కదా. ఆ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలె ? 
• కేసీఆర్ పాలనలో ఎక్కడా గొడవలు లేవు, కానీ ఇవాళ చాలాచోట్ల గొడవలు జరుగుతున్నాయి.
• కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో మైనారిటీల కోసం 3 వేల కోట్లు పెట్టింది. కానీ, వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేసింది. అవి కూడా ఖర్చు చేయలేదు, దీనిపై నేను అసెంబ్లీలో ప్రశ్నించాను.
• 40 ఏండ్ల నుంచి అడుగుతున్నా ఇక్కడ మదీనా మసీదు మరమ్మత్తులు చేయలేదు, కేసీఆర్ గారి హయాంలోనే పనులు చేపట్టారు.
• స్థలం సరిపోకపోతే 10 కోట్ల రూపాయలతో సేకరించమని కేసీఆర్ గారు చెప్పారు.
• 4 కోట్ల రూపాయలతో మదీనా ఫంక్షన్ హాల్ షాదీఖానా నిర్మాణం చేపట్టారు.
• ప్రజ్ఞాపూర్, తూఫ్రాన్ తో పాటు, జిల్లాలో అంతటా ఖబరస్తాన్ పనులు చేపట్టారు.
• కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది.
• ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పనులను  తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments